భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 7) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపరిచి, మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 30లో కొన్నిమినహా మిగతా స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.
లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,231.38 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,279.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,054.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.2.30 సమయానికి 244.85 (0.47%) పాయింట్లు ఎగిసి 52,338.48 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,725.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,725.10 వద్ద గరిష్టాన్ని, 15,678.10 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.2.30 సమయానికి 91.90 (0.59%) పాయింట్లు లాభపడి 15,762.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 4.48 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.75 శాతం, HDFC 1.06 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.54 శాతం, సిప్లా 0.52 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.60 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.49 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.12 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.50 శాతం, నిఫ్టీ ఐటీ 1.11 శాతం, నిఫ్టీ మీడియా 1.59 శాతం, నిఫ్టీ మెటల్ 0.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.00 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.14 శాతం, నిఫ్టీ ఫార్మా 0.03 శాతం నష్టపోయాయి.