కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్లను సంతృప్తిపరచలేకపోయాయి. మరోవైపు, కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో సోమవారం (మే 18) మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 130.47 పాయింట్లు లేదా 0.42% నష్టపోయి 30,967.26, నిఫ్టీ 42.50 పాయింట్లు లేదా 0.47% నష్టపోయి 9,094.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 525 షేర్లు లాభాల్లో, 293 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 58 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
డాలర్ మారకంతో భారత రూపాయి శుక్రవారం 75.57 వద్ద క్లోజ్ కాగా, ఈ రోజు 27 పైసలు నష్టపోయి 75.84 వద్ద ప్రారంభమైంది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 6 శాతం కోల్పోయింది. ఆటో, మెటల్ రంగాలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వేదాంత ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications