స్టాక్ మార్కెట్ నేడు (ఫిబ్రవరి 23, బుధవారం) రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు నష్టాల్లో ముగిసింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 57,300 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నేడు ఉదయం లాభాల్లో ప్రారంభమైంది. అయితే స్వల్ప లాభాల్లోనే మధ్యాహ్నం గం.3 వరకు కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ప్రధానంగా వరుసగా ఐదు రోజుల పాటు నష్టపోవడం, ముఖ్యంగా నిన్న సూచీలు కుప్పకూలిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేడు ఉదయం నుండి కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. కానీ చివరి అరగంటలో మాత్రం మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 57,632.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,733.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,109.24 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,194.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,220.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,027.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 68.62 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 57,232 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28.95 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టపోయి 17,063 పాయింట్ల వద్ద ముగిసింది.

రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అయితే మార్కెట్లు వరుసగా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఆసియా సూచీలు నేడు ఉదయం సానుకూలంగా కదలాడాయి. భారత్ సూచీలు కూడా కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో కాస్త లాభాల్లో కనిపించింది. అయితే సాయంత్రానికి కొనుగోళ్ల మద్దతు కోల్పోయి తిరిగి నష్టాల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఉక్రెయిన్ పైన రష్యా ఆక్రమణలు ప్రారంభమయ్యయానే ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications