భారీ నష్టాల నుండి కోలుకొని, ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత మధ్యాహ్నం నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో 150 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తిరిగి కోలుకుంది. దీంతో చివరకు 18 పాయింట్ల పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 53,244.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,290.81 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,997.09 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 15,958.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,962.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,882.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 18.79 (0.035%) పాయింట్లు నష్టపోయి 53,140.06 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.80 (0.0050%) పాయింట్లు నష్టపోయి 15,923.40 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికాం, మెటల్, రియాల్టీ ఇంధన, విద్యుత్ రంగాల నుండి లభించిన మద్దతును ఐటీ, టెక్, బ్యాంకింగ్ షేర్లు నీరుగార్చాయి. అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు ఉండడంతో సూచీలు అప్రమత్తంగా కదిలాయి.
నేటి టాప్ 5 స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, రిలయన్స్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, HCL టెక్, రిలయన్స్ ఉన్నాయి.