రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు క్షీణించడానికి తోడు దేశీయంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఐదింట నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడం లేదా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ముఖ్యంగా రాజకీయంగా ఉత్తర ప్రదేశ్ ఏ పార్టీకి అయినా కీలకం. ఈ రాష్ట్రంలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఇది మార్కెట్ పరుగుకు కారణమైంది. 2024 ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి ఫలితాలు అనుకూలంగా ఉండటంతో వరుసగా మూడో రోజు బుల్ రన్ కనిపించింది.
సెన్సెక్స్ ఉదయం 56,242 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,242 పాయింట్ల వద్దే గరిష్టాన్ని తాకింది. 54,982 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 817 పాయింట్లు ఎగిసి 55,464 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి గరిష్టం నుండి దాదాపు 800 పాయింట్లు క్షీణించింది. నేడు ఓ సమయంలో 1600 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ నేడు 56,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. కానీ చివరకు ఈ దిగువనే ముగిసింది. నిఫ్టీ 249 పాయింట్లు లాభపడి 16,594 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 16,757 పాయింట్లను తాకింది.

అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా ఉండటం, ముఖ్యంగా యూపీలో బీజేపీ కూటమి విజయం సాధించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ రాష్ట్ర ఫలితాల ఆధారంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండటంతో సంస్కరణల వేగం కొనసాగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా మధ్య సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాక్, యూఏఈ సహా ఒపెక్ దేశాల నుండి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలు ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేశాయి. దీంతో కమోడిటీ ధరలు దిగి వచ్చాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications