అమెరికా వెళ్లే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఆ నగరాలకు వీసా అప్లికేషన్ సెంటర్లు

ఆంధ్రాప్రదేశ్ ప్రజలు అమెరికా కాన్సులర్‌ చీఫ్‌ రెబెకా డ్రామ్‌ తీపికబురు అందించారు. తర్వలోనే విశాఖపట్టణం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దింతో అమెరికాకు వెళ్లాలనుకున్న ఎపి ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు వీసా అప్లికేషన్ కోసం కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ, ఆంధ్రాప్రదేశ్ విభజన తరువాత ఏపీలో మొట్టమొదటి వీసా అప్లికేషన్ సెంటర్ రావడం గమనించదగ్గ విషయం.వీసా

అప్లికేషన్ సెంటర్ అంటే ఏమిటి
వీసా అప్లికేషన్ సెంటర్ అనేది ఇక్కడ మీ వీసా అప్లికేషన్ ఫార్మ్స్ స్వీకరిస్తారు. అంటే ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే అందుకు కావాల్సిన అప్లికేషన్ డాక్యూమెంట్స్, పేపర్ వర్క్ నిర్వహిస్తారు. ఈ ప్రాసెస్ కోసం మీరు ప్రైవేట్ వీసా కన్సల్టెంట్ ఆఫీసులకి వెళ్లాల్సిన పని లేదు. కానీ వీసా అప్రూవల్ కాన్సులర్ ఆఫీసర్ లేదా యుఎస్ ఎంబసీ నిర్ణయిస్తుంది. అలాగే ఇది అమెరికా వెళ్లాలనుకునే ప్రజలకు ప్రాసెసింగ్ సులభతరం చేయనుంది.

Indians are among highest foreign students in America 56Percent of telugu state students in US universities

గత ఏడాది నుండి ఇప్పటివరకు చైనాను వెనక్కి నెట్టి అమెరికా యూనివర్సిటీలకు వెళ్తున్నప్రపంచ విద్యార్థులలో అగ్రదేశంగా భారత్‌ అవతరిస్తే అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుండి తెలుగువారే అత్యధికంగా ఉన్నారు. US కాన్సులేట్-జనరల్, హైదరాబాద్ నుండి వచ్చిన డేటా ప్రకారం గత సంవత్సరం USకి వెళ్లిన భారతీయ విద్యార్థులలో దాదాపు 56% మంది ఈ రెండు రాష్ట్రాల నుండే ఉన్నారు అందులో 34% మంది తెలంగాణ నుండి, 22% మంది ఆంధ్రా నుండి ఉన్నారు.

అలాగే భారతీయ విద్యాసంస్థల్లో చేరిన US విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే 300% పెరిగింది.ఈ వివరాలను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులర్‌ చీఫ్‌ రెబెకా డ్రామ్‌, ప్రజా వ్యవహారాల అధికారి అలెగ్జాండర్‌ మెక్‌లారెన్‌ మంగళవారం విశాఖపట్నం పర్యటనలో వెల్లడించారు. అయితే తెలంగాణ, ఆంధ్రా నుండి ఖచ్చితమైన విద్యార్థుల సంఖ్యను వెల్లడించనప్పటికీ 2023లో భారతదేశం దాదాపు 3.3 లక్షల మంది విద్యార్థులను యుఎస్‌కు పంపగా అందులో దాదాపు 1.8 లక్షలు ఉండొచ్చు.

"భారతదేశంలో US వీసాల డిమాండ్ తృప్తి చెందట్లేదు. గత సంవత్సరం మేము 1.4 మిలియన్ల వీసాలను ప్రాసెస్ చేసాము. ఇది జనాభాలో పదో వంతు మాత్రమే అయినప్పటికీ భారతదేశంలో పనిచేస్తున్న ఏ ఇతర దేశం (కాన్సులేట్) ఇన్ని వీసాలను ప్రాసెస్ చేయలేదు. గత ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో మా స్టాఫ్ రెండింతలు పెరిగారు. 2025 ప్రారంభంలో ఈ స్టాఫ్ దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం మేము రోజుకు 1,600 వీసాలను ప్రాసెస్ చేస్తాము, ఈ సంఖ్యా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దాదాపు 2,500కి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత ఎక్కువ పెరగవచ్చు " అని రెబెకా డ్రేమ్‌ అన్నారు.

హైదరాబాద్ కాన్సులేట్ 2024 సమ్మర్ స్టూడెంట్ వీసా సీజన్‌లో 47,000 స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిర్వహించింది, అయితే అంతకుముందు ఏడాది 2023తో పోల్చితే 35,000 నుండి పెరిగింది. ప్రజా వ్యవహారాల అధికారి మెక్‌లారెన్ సోమవారం విడుదల చేసిన US ఓపెన్ డోర్స్ రిపోర్ట్ వెల్లడిస్తూ భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదలను హైలైట్ చేసింది. "ఈ సంవత్సరం అమెరికాకు విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. చాలా మంది భారతీయ విద్యార్థులలో పురుషులు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్తుండగా అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో రిజిస్ట్రేషన్స్ పెరగవచ్చు" అని మెక్‌లారెన్ చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+