Red Sea crisis: భారతదేశంలోని టైర్ పరిశ్రమ ఎర్ర సముద్రం అంతరాయం కారణంగా రవాణా సమయాలు, సరుకు రవాణా ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు టైర్ల ఎగుమతులతో పాటు వాటికి అవసరమైన ముడిపదార్థాల దిగుమతులను సైతం భారీగా దెబ్బతీస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తతం చేస్తున్నాయి.
కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా నౌకలను మళ్లించడం వల్ల ఇండియా-రోటర్డ్యామ్ సరుకు రవాణా ధరలు 3-4 రెట్లు పెరిగాయని, అలాగే రవాణా సమయం 14 రోజులు పెరిగిందని ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బుధ్రాజా వెల్లడించారు. తూర్పు తీరానికి 8-10 రోజులు పెరిగిందన్నారు. పశ్చిమ తీరానికి సరుకు రవాణా ధరలు రెట్టింపు కాగా, తూర్పు తీరానికి 40 శాతం పెరిగింది. కంటైనర్ లభ్యత కూడా కొంతమేర ప్రభావం చూపిందని, అయితే కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు.

భారత్ నుంచి US ఈస్ట్ కోస్ట్, యూరప్, పశ్చిమ ఆసియా తూర్పు, ఆఫ్రికా దేశాలకు సరుకులను పంపడానికి ఎర్ర సముద్రం ఒక ప్రముఖ ఛానెల్. సౌత్ల్యాండ్ రబ్బర్ గ్రూప్తో కలిసి పని చేస్తున్న రాజీవ్ థారియన్, భారతీయ మార్కెట్కు సహజ రబ్బరు ప్రధాన ప్రాసెసర్ అలాగే దిగుమతిదారు కూడా. ప్రస్తుత సమయంలో వివిధ దేశాల మధ్య రవాణా ఛార్జీలు 100 నుంచి 300 శాతం మేర పెరిగాయి. కంటైనర్ల కొరత తీవ్రంగా ఉంది. సముద్రయానంలో బాక్సులకు ఎక్కువ సర్క్యులేషన్ సమయం ఉండటం వల్ల అన్ని ప్రదేశాల నుండి ప్రణాళికాబద్ధమైన సరుకులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమెరికా, యూరప్లోని అనేక టైర్ కంపెనీలు సమీప షిప్మెంట్ల కోసం దూకుడుగా కొనుగోలు చేయడానికి, రాబోయే వారాలు నెలల్లో షిప్పింగ్లో ఆలస్యం అయ్యే ప్రమాదం కారణంగా NRతో సహా ముడి పదార్థాల బఫర్ స్టాక్ను పెంచడానికి దారితీసిందన్నారు. సాధారణంగా రబ్బర్ ఉత్పత్తి అత్యధికంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఉంటుంది. ఆ తర్వాత చలికాలం కారణంగా చాలా దేశాలు తక్కువ ఉత్పత్తి సీజన్లోకి వెళతాయని తెలుస్తోంది. ఎర్ర సముద్ర సంక్షోభం పరిశ్రమ దేశీయ కొనుగోళ్లను ప్రభావితం చేయలేదని ఇండియన్ రబ్బర్ డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జార్జ్ వాలీ అన్నారు. ప్రస్తుతం సహజ రబ్బరు ధరలు కిలోకు రూ.6 పెరిగి కిలోకు రూ.160కి చేరుకున్నాయి


Click it and Unblock the Notifications