HCLTech: దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఇటీవల హెచ్ఆర్ పాలసీలో మార్పులు చేపట్టింది. అయితే ఇది ఉద్యోగులు పొందే వేతనంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది.
అయితే ఈ వార్త టెక్కీల్లో కొంత ఆందోళనకు కారణమైంది. దీంతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన తర్వాత.. IT ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. అసలు కంపెనీ తన పాలసీలో మార్పులు ఎందుకు చేసిందనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.

హెచ్సీఎల్టెక్ ఉద్యోగుల వేతనాన్ని తగ్గించిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. తాజాగా కంపెనీ చేసిన పాలసీ మార్పుల వల్ల ఉద్యోగులు కరోనాకి ముందర స్థాయిలో అందుకుంటున్న వేతనాలకు తిరిగి చేరుకున్నారని వెల్లడించింది. పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఉద్యోగులకు అందించే EPB ప్రీ-కోవిడ్ ఫార్మాట్కు తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తమ ఉద్యోగులకు వెల్లడించామని కంపెనీ తెలిపింది.
కంపెనీ అందించే శాలరీ ప్యాకేజీ కింద E3 బ్యాండ్ వరకు ఉండే ఉద్యోగులందరికీ ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అందిస్తుంది. ఇది మెుత్తం ఉద్యోగికి అందించే పరిహారంలో దాదాపు 3-4 శాతం మాత్రమే ఉంటుంది. సగటున కంపెనీ దీనిలో 80 శాతాన్ని ఉద్యోగులకు చెల్లిస్తుంటుంది. అయితే కరోనా సమయంలో ఉద్యోగులకు ఆర్థికంగా సపోర్ట్ చేసేందుకు పాలసీకి మినహాయింపు ఇస్తూ పనితీరుతో సంబంధం లేకుండా అందరికీ 100 శాతం EPBని చెల్లించింది. అయితే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటంతో కంపెనీ తన అసలు పాలసీకి తిరిగి వస్తున్నట్లు ఉద్యోగులకు తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications