HCLTech: దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఇటీవల హెచ్ఆర్ పాలసీలో మార్పులు చేపట్టింది. అయితే ఇది ఉద్యోగులు పొందే వేతనంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది.
అయితే ఈ వార్త టెక్కీల్లో కొంత ఆందోళనకు కారణమైంది. దీంతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన తర్వాత.. IT ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. అసలు కంపెనీ తన పాలసీలో మార్పులు ఎందుకు చేసిందనే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.

హెచ్సీఎల్టెక్ ఉద్యోగుల వేతనాన్ని తగ్గించిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. తాజాగా కంపెనీ చేసిన పాలసీ మార్పుల వల్ల ఉద్యోగులు కరోనాకి ముందర స్థాయిలో అందుకుంటున్న వేతనాలకు తిరిగి చేరుకున్నారని వెల్లడించింది. పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఉద్యోగులకు అందించే EPB ప్రీ-కోవిడ్ ఫార్మాట్కు తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తమ ఉద్యోగులకు వెల్లడించామని కంపెనీ తెలిపింది.
కంపెనీ అందించే శాలరీ ప్యాకేజీ కింద E3 బ్యాండ్ వరకు ఉండే ఉద్యోగులందరికీ ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అందిస్తుంది. ఇది మెుత్తం ఉద్యోగికి అందించే పరిహారంలో దాదాపు 3-4 శాతం మాత్రమే ఉంటుంది. సగటున కంపెనీ దీనిలో 80 శాతాన్ని ఉద్యోగులకు చెల్లిస్తుంటుంది. అయితే కరోనా సమయంలో ఉద్యోగులకు ఆర్థికంగా సపోర్ట్ చేసేందుకు పాలసీకి మినహాయింపు ఇస్తూ పనితీరుతో సంబంధం లేకుండా అందరికీ 100 శాతం EPBని చెల్లించింది. అయితే కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటంతో కంపెనీ తన అసలు పాలసీకి తిరిగి వస్తున్నట్లు ఉద్యోగులకు తెలిపింది.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications