IT News: సాఫ్ట్ వేర్ కొలువు అంటే అంత సులువు కాదు. కొంద మంది వీరిని చూసి కూర్చుని లక్షలు వేతనంగా అందుకుంటున్నారంటూ భావిస్తుంటారు. అయితే దాని వెనుక ఉండే శ్రమ గురించి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయరు.
అసలే టైమ్ బాగోలేదు. ప్రపంచంలో ఏ మూలన విన్నా ఐటీ రంగంలో మందగమనం వల్ల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయనే వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని చాలా మంది భారతీయ టెక్కీలు మాత్రం అలుపెరగక పనిచేస్తున్నారు. ఇది వారిపై అధిక పని భారాన్ని పెంచుతోందని ఇటీవల తెలుస్తోంది. సాధారణంగా పనిగంటల కంటే రెండు మూడు గంటలు అధికంగా పనిచేయాల్సి వస్తోందని కొందరు టెక్ ఉద్యోగులు చెబుతున్నారు.

దీనికి అసలు కారణం కంపెనీల ప్రాజెక్టుల డెడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగులు పనిచేయాల్సి రావటమే. ఈ క్రమంలో సగటన వారానికి 50 నుంచి 60 గంటల మధ్య ఉద్యోగులు తమ వృత్తి కోసం సమయాన్ని కేటాయిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 10 గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం ఉద్యోగంలో గడుపుతున్నారు. వాస్తవానికి దేశంలోని కార్మిక శాఖ చట్టాల ప్రకారం 8 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంది. కానీ వాస్తవానికి ఐటీ రంగంలోని కొందరు ఉద్యోగులు మాత్రం దాదాపు 3 నుంచి 4 గంటలు అధికంగా సమయాన్ని రోజూ ఆఫీసుల కోసమే అధికంగా వెచ్చిస్తున్నారు.
ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక మందగమనంలో కొత్త ఉద్యోగాలు లేకపోవటం, కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయటంతో జాబ్ మారాలనే ఆలోచన సైతం చాలా మంది టెక్కీలను భయపెడుతోంది. ప్రస్తుతం కంపెనీలు తమ ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు ద్వారా ఎక్కువే రాబడిని పొందుతున్నట్లు తాజా గణాంకాలు బయటపెట్టాయి. దేశంలోని కొన్ని టెక్ కంపెనీలు ఉద్యోగి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోగా.. కొన్ని దిగ్గజ కంపెనీల విషయంలో మాత్రం అది తగ్గింది. అంటే పెద్ద కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయని, ఆదాయాలు తగ్గుతున్నాయని ఇది సూచిస్తోంది. దీంతో ఆ ప్రభావం పరోక్షంగా కొంత ఉద్యోగులకు పని ఒత్తిడి రూపంలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications