Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అమెరికా డేటా విడుదల కావటంతో..
Stock Market: నిన్న స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించిన మార్కెట్లు నేడు మరింత బేజారాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లు ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 211 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 37 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 38 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న వేళ భారత మార్కెట్లు సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఈ రోజు ప్రధానంగా ఆటో రంగంలోని షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్ లో ఉన్నాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లో సైతం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అమెరిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు అంచనాలకు మించి ఉండటంతో మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తోంది.
NSE సూచీలో ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బ్రిటానియా, సిప్లా, ఓఎన్జీసీ, మారుతీ, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలో దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎన్జీపీసీ, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.