Stock Market: లాభాల్లో మెరుస్తున్న స్టాక్ మార్కెట్లు.. కానీ కొంచెం తడబడుతూ..
Stock Market: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే క్రితం ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లు లాభాల్లోనే ఉన్నప్పటికీ కొంత తడబాటుకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 425 పాయింట్లు, నిఫ్టీ సూచీ 112 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 76 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం తడబడుతూ స్వల్ప నష్టాల్లో 65 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు నిన్నటికంటే బలంగా పుంజుకున్నాయి.
టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, నెస్లే ఇండియా, యూపీఎల్, పవర్ గ్రిడ్, టీసీఎస్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, టాటా స్టీల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, విప్రో, సిప్లా, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.