Stock Market: వరుస లాభాలను కొనసాగిస్తున్న Nifty, Sensex.. అమెరికా మార్కెట్ల చలవ..
Stock Market: నిన్న ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభాల్లోనే తమ ప్రయాణాన్ని ముంగించాయి. ఈ క్రమంలో నేడు సూచీలు లాభాల ప్రారంభాన్ని కొనసాగించాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు, నిఫ్టీ సూచీ 57 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 3 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 129 పాయింట్ల లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం కొంత ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, విప్రో, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, నెస్లే, టాటాన్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, సిప్లా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.