Stock Market: రోజులు దగ్గర పడుతున్నాయ్.. ఆశల ఊహల్లో లాభాలు.. బుల్ జోరు కంటిన్యూ..
Stock Market: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఊగిసలాటల్లో కొనసాగుతున్నప్పటికీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. మార్కెట్లో చాలా కంపెనీలు తమ క్యూ-3 ఫలితాలను విడుదల చేస్తుండటం జోష్ కు ఒక కారణంగా ఉంది. దీనికి తోడు బడ్జెట్ కి ముందు ఊహాగానాలతో ఇన్వెస్టర్లు సైతం కొంత పాజిటివ్ గా ఉన్నారు.
మార్కెట్ సూచీలు..
ఉదయం 11 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 56 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 120 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 51 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే దీనికి ముందు మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రం కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
టాప్ గెయినర్స్..
NSE సూచీలో టాటా స్టీల్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, టైటాన్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
టాప్ లూజర్స్..
ఇదే సమయంలో సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, బిపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో, సిప్లా, అల్ట్రా సిమెంట్, నెస్లే, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.