Stock Market: సూచీలకు ఫెడ్ దెబ్బ.. వడ్డీ రేట్ల పెంపుతో నష్టాల్లో ఆరంభం.. బ్యాంకింగ్ స్టాక్స్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి పెంపు నిర్ణయాన్ని ప్రకటించటంతో దేశీయ మార్కెట్లు సైతం ప్రభావితమయ్యాయి. ఇది అందరూ ఊహించినదే కావటంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి అయితే జారుకోలేదు.
పతనంలో సూచీలు..
కీలక బెంచ్ మార్క్ సూచీలు ఎరుపెక్కాయి. ప్రారంభంలోని 9.25 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 336 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 60 పాయింట్లకు పైగా కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 131 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం స్వల్పంగా 37 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.
గెయినర్స్..
NSE ఆరంభ ట్రేడింగ్ సమయంలో శ్రీ సిమెంట్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
లూజర్స్..
ఎస్బీఐ లైఫ్, హెట్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హిందాల్లో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి స్టాక్స్ నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.