Market Crash: నిన్న ఫ్లాట్ ముగింపు నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికా డెట్ సీలింగ్ విషయంలో చర్చలు జరగటంతో ఆందోళనలు నెలకొన్నాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 168 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 157 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 23 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో చాలా సెక్టోరల్ సూచీలు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్లో హిందాల్కొ, అషోక్ లేలాండ్, బయోకాన్ కంపెనీల షేర్లు ఫోకస్లో ఉన్నాయి. అమెరికా డెట్ సీలింగ్ చర్చల కారణంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. డాలర్ ధర మాత్రం రెండు నెలల గరిష్ఠానికి చేరువలో ఉంది. అయితే డాలర్-రూపీ మారక విలువలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
NSE సూచీలో పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, సిప్లా, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications