Stock Market: స్తబ్దుగా సూచీలు.. భారీ నష్టాల్లో బ్యాంకింగ్ స్టాక్స్.. అలుముకున్న ఫెడ్ భయాలు..
Stock Market Opening Bell: గత రెండు రోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ.. స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా వడ్డీ రేట్ల పెంపు భయాలతో నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.
ఊగిసలో సూచీలు..
ఉదయం 9.25 గంటలకు స్టాక్ మార్కెట్లోని బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ మాత్రం భారీ నష్టాన్ని చవిచూసి ఏకంగా 152 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 205 పాయింట్ల లాభంతో ఉంది. అయితే ఈ స్వల్ప నష్టాల నుంచి మార్కెట్లు కోలుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. హై ఓలటాలిటీ కారణంగా చివరికి ఫ్లాట్ గా ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గెయినర్స్..
హిందుస్థాన్ యూనిలివర్, హీరోమోటొ కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్టిల్ ఇండియా, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, మారుతీ, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఆరంభంలో లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
లూజర్స్..
మార్కెట్ల ఆరంభంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, యూపీఎల్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, విప్రో, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.