Stock Market: ఒడిదొడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో ఐటీ షేర్లు.. అందరి చూపు ఫలితాలపైనే..
Stock Market: ఈరోజు హుషారుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల బాటను కొనసాగించాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లో లాభాల ఆరంభంతో ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సంస్థలు మంచి లాభాలను ప్రకటించటం దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంలో ప్రారంభం కాగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్ల లాభాలతో కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 95 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 14 పాయింట్ల లాభంలో నిలిచాయి. అయితే ఈ లాభాలు క్షణాల్లోని ఆవిరై కీలక సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి.
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా స్పందించిన వేళ.. ఆసియాలోని ఇతర మార్కెట్లు అదే దోరణిని అనుకరిస్తున్నాయి. దీంతో నేడు ఆసియా మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు ప్రధానంగా కంపెనీలు విడుదల చేస్తున్న క్యూ4 ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. అయితే ఆసియా మార్కెట్లలోని నెగటివ్ సెంటిమెంట్లు భారత మార్కెట్లను సైతం ఆవరించటంతో మార్కెట్లు కొద్ది క్షణాల్లోని నష్టాల్లోకి వెళ్లాయి.
NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, హిందాల్కొ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటర్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.