Market Rally: మోదీ 2.0 చివర్లో మార్కెట్ల మెగా ర్యాలీ.. రూ.14 లక్షల కోట్ల చరిత్ర..

Stock Market: దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న వేళ స్టాక్ మార్కెట్లు కొత్త చరిత్ర లిఖిస్తూ ముందుకు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలకు బెంచ్ మార్క్ సూచీలు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఫిబ్రవరి 1, 2021 తర్వాత సెన్సెక్స్-నిఫ్టీలలో అతిపెద్ద వన్డే పెరుగుదల జూన్ 3, 2024 సోమవారం రోజున నమోదైంది. ఆ సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రెండు సూచీలు దాదాపు ఐదు శాతం బలపడ్డాయి. 2019 మే 20న 'ఎగ్జిట్ పోల్' తర్వాత కూడా సెన్సెక్స్-నిఫ్టీలు మూడు శాతానికి పైగా మాత్రమే లాభపడటం మనం చూశాం. ఇక మే 13, 2009 ఎగ్జిట్ పోల్ తర్వాత సెన్సెక్స్ 1.22 శాతం అంటే 146.74 పాయింట్లు పడిపోయింది. కానీ ఈసారి మార్కెట్లలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కొనసాగుతున్నాయి.

Indian stock markets rallied big on monday with exit polls expect modi win gains 14 lakh cr

పెరిగిన విశ్వాసంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ డబ్బును భారత స్టాక్ మార్కెట్‌లకు తీసుకొస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,464 కోట్ల విలువైన షేర్లను వారు కొనుగోలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సోమవారం రూ.6,850 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనికి ముందు గత కొన్ని రోజులుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కొనసాగిన అనిశ్చితి కారణంగా వారు మే నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.25,586 కోట్లను వెనక్కు తీసుకోవటం గమనార్హం.

వాస్తవానికి ఈ మెగా ర్యాలీతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా పెరిగాయి. నిన్న ట్రేడింగ్ ముగింపు నాటికి నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 629.65 పాయింట్లు బలమైన జంప్‌తో 8,022 పాయింట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండెక్స్‌లో చేర్చబడిన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు అత్యధికంగా 12.53 శాతం పెరిగాయి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ షేర్లు తొమ్మిది శాతానికి పైగా లాభపడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది.

ర్యాలీలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు అత్యధికంగా 13.51 శాతం పెరిగాయి. దీని తరువాత గెయిల్, ఆర్‌ఈసీ లిమిటెడ్‌లలో కూడా 12 శాతం కంటే ఎక్కువ బలమైన వృద్ధిని సాధించాయి. అలాగే పవర్ కంపెనీలు, చమురు, ఇంధనం, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ కంపెనీల షేర్లు ఎనిమిది శాతం వరకు పెరిగాయి. నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ మూడు శాతానికి పైగా పెరగడంతో ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ.13.78 లక్షల కోట్ల భారీ పెరుగుదల నమోదైంది. ఈ రికార్డు స్థాయి పెరుగుదలతో, BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,78,630 కోట్లు పెరిగి రూ.4,25,91,511.54 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం చెలరేగిపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+