Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో జోష్ నెలకొంది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ గరిష్ఠంగా 1100 పాయింట్ల మేర లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 17,900 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. మార్కెట్ల పెరుగుదలకు ప్రధానంగా మెటల్, ఆటో, రియల్టీ, ఫైనాన్స్ రంగాలు కీలకంగా నిలిచాయి.
ఐటీసీ స్టాక్..
కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై కస్టమర్స్ సుంఖం రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో సిగరెట్ తయారీ వ్యాపారంలో ఉన్న అనేక కంపెనీల షేర్లు బేజారాయి. దీంతో ఐటీసీ, గోల్డ్ ఫ్రే ఫిలిప్, గోల్డెన్ టొబ్యాకో, వీఎస్టీ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల షేర్లు ప్రభావితం అవుతాయి. ఇదే క్రమంలో దేశంలో పొగాకు ఉత్పత్తుల తయారీలో ఉన్న పురాతన కంపెనీ ఐటీసీ షేర్ సైతం 6 శాతం మేర నష్టపోయింది.
టాప్ గెయినర్స్..
మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, ఎయిర్ టెల్, హీరో మోటొకార్ప్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కొ, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, బీపీసీఎల్, యూపీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.