Stock Market: ఫుల్ జోష్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. పండుగ ముందు పరుగులు.. ఫోకస్ స్టాక్స్ ఇవే..
Stock Market Opening Bell: నిన్నంతా ఊగిసలాడుతూ చివరికి స్వల్ప లాభనష్టాల్లో ఇండెక్సులు మిగిశాయి. అయితే ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాల మధ్య ఇండీసెస్ మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఒపెనింగ్ గ్యాప్ అప్ తో ప్రారంభమైన బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ ఉదయం 9.20 గంటలకు 585 పాయింట్ల లాభంలో, మరో కీలక సూచీ నిఫ్టీ 160 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 397 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 260 పాయింట్లు ఎగబాకి మార్కెట్లు జోష్ లో కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఐషర్ మోటార్స్, హిందాల్కొ, కోల్ ఇండియా స్టాక్స్ ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి. వీటికి తోడు టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ , టాటా కన్సల్టెన్సీ వంటి ఐటీ షేర్లు ప్రధాన్యం సంతరించుకున్ననాయి. ఇవే కాకుండా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కు చెందిన కొన్ని స్టాక్స్ సైతం గమనించదగ్గ మెుమెంటం కలిగి ఉన్నాయ
అమెరికాలో గ్యాసోలిన్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో అక్కడ క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గటం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. ఇదే సమయంలో మన దేశంలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం జూలై మాసంలో కొంత అదుపులోకి రావటం ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది. విప్రో కంపెనీ ఆస్ట్రేలియాలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో విప్రో షిల్టేను లాంట్ చేయటం షేర్ పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది.
ఇదే సమయంలో దేశీయ విమానయాన రంగానికి చెందిన వివిధ స్టాక్స్ సైతం ప్రభుత్వ ప్రకటనతో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆగష్టు చివరి నాటికి డొమెస్టిక్ విమాన టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం లిమిట్ తొలగించనున్నందున స్టాక్స్ పాజిటివ్ గా ప్రభావితం కావచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇలా అనేక పాజిటివ్ కారణాల మధ్య ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి.