Market Opening: ఈవారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుతో మార్కెట్లలో రక్తపాతం మెుదలైంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 480 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 146 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 476 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 587 పాయింట్ల మేర నష్టాల్లో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లను సైతం యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇవి మార్కెట్లను భారీ నష్టాలతో అతలాకుతలం చేస్తున్నాయి.

NSEలో ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు ఈ క్రమంలో లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, హిందాల్కొ, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికా బాండ్ ఈల్డ్స్ మరింతగా పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ 4.799 శాతం, రెండు సంవత్సరాల ట్రెజరీ బాండ్స్ 5.085 శాతం అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. దీంతో విదేశీ మదుపరులు తమ డబ్బును బాండ్స్ మార్కెట్లో పార్క్ చేసేందుకు మక్కువ చూపుతూ ఈక్విటీల నుంచి నిష్ర్కమిస్తున్నారు. ఈ ధోరణి అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి మార్కెట్లకు చేటు చేస్తోంది. విదేశీ మదుపరులు అందుకే లాభాలను స్వీకరిస్తూ తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications