Stock Market Closing: పేదలుగా మారిన పెట్టుబడిదారులు.. రూ.4 లక్షల కోట్లు హాంఫట్.. మార్కెట్స్ బ్లీడింగ్..
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు మిగిల్చాయి. ఆరంభంలో ఈ రోజు నష్టాలతో మెుదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింతగా క్షీణించాయి. ఉదయం పతనానికి హెచ్డీఎఫ్సీ రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి.
భారీ నష్టాలు..
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ మధ్య కాలంలో బెంచ్మార్క్ సూచీలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇంట్రాడే ట్రేడ్లో బెంచ్మార్క్లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి, పెట్టుబడిదారులకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.277.58 లక్షల కోట్లకు పడిపోయింది. అలా మార్కెట్లు వారాంతంలో ఇన్వెస్టర్లకు కన్నీరు మిగిల్చాయి.
మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంలో ముగియగా.. నిఫ్టీ సూచీ 302 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 1084 పాయింట్లు, నిఫ్టీ మిండ్ క్యాప్ సూచీ 747 పాయింట్లను నష్టపోయాయి.
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటన తర్వాత రిజర్వు బ్యాంక్ త్వరలో రేట్లను పెంచనున్న తరుణంలో దేశీయ ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా నేడు బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి.
టాప్ లూజర్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి పవర్ గ్రిడ్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, యూపీఎల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్స్, యాక్సిస్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూసి చివరికి టాప్ లూజర్స్ జాబితాలో ముగిశాయి.
టాప్ గెయినర్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, ఐటీసీ కంపెనీలు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.