Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. Paytm షేర్ల పతనం.. కారణం..
Stock Market: ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రారంభమయ్యాయి. ఆరంభంలో ఫ్లాట్ గా ఉన్న సూచీలు చివరికి లాభాల్లోనే ముగిశాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం దీనివెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
మార్కెట్ సూచీలు..
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 84 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 110 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 168 పాయింట్ల లాభంలో ముగిసింది.
పేటీఎం షేర్..
ఈరోజు స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ భారీగా పతనమైంది. దాదాపు 12 శాతం వరకు నష్టపోయింది. ప్రస్తుతం షేర్ విలువ మార్కెట్ క్లోజింగ్ నాటికి రూ.475.55 వద్ద ఉంది. ఇది షేర్ భారీ పతనాల్లో ఒకటని చెప్పుకోవాలి. రిలయన్స్ ఫిన్ టెక్ తన ఎన్బీఎఫ్సీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు పేటీఎంను భారీగా దెబ్బతీయవచ్చని తెలుస్తోంది. జియో ఫైనాన్స్ దేశంలో 5వ అతి పెద్ద సంస్థగా ఎదుగుతుందని ఫారిన్ బ్రోకరేజ్ మాక్విన్ వెల్లడించటంతో పేటీఎం షేర్లు ప్రభావితం అయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్డబ్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. ఇదే క్రమంలో బీపీసీఎల్, నెస్లే, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓన్జీసీ, కోల్ ఇండియా, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.