Stock Market: హమ్మయ్యా.. లాభాలతో గట్టెక్కిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఓలటాలిటీలో కొనసాగినప్పటికీ చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఉదయం నష్టాలను మార్కెట్లు చెరిపేశాయి. ఈ క్రమంలో ఎఫ్ఎమ్సీజీ, ఆటో, రియల్టీ రంగాల షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 99 పాయింట్లు లాభ పడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 3 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 125 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
NSEలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, ఎల్ టి, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో విప్రో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, హిందాల్కొ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.