Stock Market: ఉదయం నష్టాలు.. సాయంత్రానికి లాభాలు.. మెరిసిన మెటల్స్..
Stock Market: నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే అనూహ్యంగా తేరుకున్న మార్కెట్లు సాయంత్రానికి లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయ్యాయి. వారాంతపు, నెలాంతపు ఆప్షన్ ఎక్స్ పైరీ కావటం విశేషం.
లాభాల్లో సూచీలు..
సాయంత్రం మార్కెట్లు ముగిసే నాటికి బెంచ్ మార్కె సూచీ నిఫ్టీ 223 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 424 పాయింట్లు, మిడ్ క్యాప్ నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే నాటికి మెటల్ రంగంలో షేర్లు లాభపడ్డాయి. దీనికి తోడు బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల సూచీలు సైతం 1 శాతం మేర లాభపడ్డాయి.
టాప్ గెయినర్స్..
భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
టాప్ లూజర్స్..
టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, టైటాన్, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్స్, బ్రిటానియా, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రం మార్కెట్లు ముగిసే నాటికి నష్టాల్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.