Stock Market: బుల్స్ జోరుతో చెలరేగిన స్టాక్ మార్కెట్లు.. అన్నీ లాభాల్లోనే..
Closing Bell: ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మెుత్తానికి రోజంతా అదే ఊపును కొనసాగించాయి. దీంతో అన్ని ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 418 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం 115 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 136 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 419 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.

మార్కెట్ క్లోజింగ్ బెల్ సమయానికి అన్నిసెక్టార్ల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ముఖ్యంగా రియల్టీ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇదే సమయంలో ఎఫ్ఎమ్సీజీ, ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సూచీలు ఒక్క శాతం మేర లాభపడ్డాయి. అలాగే డాలర్తో రూపాయి మారకపు విలువ స్వల్పంగా లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, సిప్లా, ఐటీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, మారుతీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి నేడు టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications