Stock Market: లాభాల్లో టేకాఫ్.. కానీ నష్టాలతో క్లోజింగ్.. భయంతో మార్కెట్లో బలహీనత..
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అండతో మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్నటి నష్టాలు పూడ్చుకోవచ్చని భావించిన వారికి అడియాశే మిగిలింది. అనూహ్యంగా మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకోవటానికి భయాలే కారణమని తెలుస్తోంది.
మార్కెట్ సూచీలు..
ట్రేడింగ్ చివరి గంటల్లో సూచీలు కొంత నష్టాల నుంచి తేరుకున్నాయి. అయితే దలాల్ స్ట్రీట్ నేడు కూడా బేర్స్ చేతుల్లోనే కొనసాగింది. మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోగా.. బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్ల నష్టంలో నేటి మార్కెట్ ప్రయాణాన్ని ముగించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 158 పాయింట్ల లాభంలో ముగియటం గమనార్హం.
టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని సిప్లా, బజాజ్ ఆటో, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, ఎస్టీపీసీ, హీరో మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు మాత్రం మార్కెట్ క్లోజింగ్ సమయానికి లాభాల్లో కొనసాగాయి. దీంతో అవి నేడు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
టాప్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి నేడు టాప్ లూజర్స్ గా నిలిచాయి.