Stock Market: లాభాలతో దుమ్ముదులిపిన మార్కెట్లు.. అన్ని రంగాలు గ్రీన్లో క్లోజ్
Market Closing: ఉదయం ఐటీ రంగం అనిశ్చితుల మధ్య మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో ఏప్రిల్ చివరి ట్రేడింగ్ రోజులు దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 463 పాయింట్ల లాభంతో నెల చివరి రోజు ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 150 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 233 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 390 పాయింట్ల లాభంలో తమ ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాలు లాభాల్లో ముగియగా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం మేర లాభపడ్డాయి.
గ్లోబల్ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, మార్కెట్ ప్రారంభంలో అస్థిరత వల్ల నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా నుంచి వచ్చిన మిశ్రమ స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు ఫైనాన్షియల్ స్టాక్స్లో నష్టాల వల్ల భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో లాభాలను కోల్పోయాయి. అయితే ఆ తర్వాత దేశీయ మార్కెట్లు బలమైన రికవరీని నమోదు చేశాయి.
NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, నెస్లే, విప్రో, బ్రిటానియా, ఐటీసీ, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, రిలయన్స్, యూపీఎల్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్గా నిలిచాయి.
ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, హిందుస్థాన్ యూనిలివర్, బాలాజీ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్గా నిలిచాయి.