Stock Market: ఒకపక్క లాభాలు.. మరోపక్క నష్టాలు.. మార్కెట్లకు ఏమైంది..?
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ-4 లాభాల కోలాహలం కొనసాగుతోంది. దీంతో ఉదయం సూచీలు లాభాల్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ఈ క్రమంలో ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లు దూకుడు కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 129 పాయింట్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 52 పాయింట్లు కోల్పోయింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 54 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 192 పాయింట్లు నష్టపోయింది.
NSE సూచీలో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫస్టీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, హిందాల్కొ కంపెనీ షేర్లు లాభాలో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, టైటాన్, ఎల్ టి, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా కంపెనీల షేర్లు మాత్రం తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.