Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన ఫార్మా, మెటల్ స్టాక్స్..
Closing Bell: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల మధ్య ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ఈ క్రమంలో తర్వాత కోలుకున్నప్పటికీ ఓలటాలిటీ కారణంగా లాభాలు ఆవిరయ్యాయి. దీంతో కీలక సూచీలు తమ ప్రయాణాన్ని నష్టాలతో ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 208 పాయింట్లు, నిఫ్టీ సూచీ 63 పాయింట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 276 పాయింట్ల నష్టపోయింది. అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ మాత్రం 69 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది.
NSE సూచీలో మార్కెట్ క్లోజింగ్ సమయానికి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, మారుతీ, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, విప్రో, బజాజ్ ఆటో, యూపీఎల్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.