Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అదరగొట్టిన మెటల్, ఆయిల్&గ్యాస్ స్టాక్స్..
Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల అండతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు చివరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒలటాలిటీ నడుమ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా ఉండటం బుల్ రన్ కొనసాగించటానికి దోహదపడింది.
సూచీల క్లోజింగ్..
మార్కెట్స్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ కేవలం 23 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యింది. మరో పక్క బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి లాభాలతో 272 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 80 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియటం కూడా దీనికి అండగా నిలిచిందని చెప్పుకోవాలి.
టాప్ గెయినర్స్..
మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ సూచీలోని అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, మారుతీ, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కొ తో పాటు మరిన్ని స్టాక్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
టాప్ లూజర్స్..
మార్కెట్ క్లోజింగ్ సమయానికి అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్స్ట్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్, టీసీఎస్ తో పాటు మరిన్ని ఎన్ఎస్ఈ సూచీలోని షేర్లు నష్టాలను నమోదు చేసి టాప్ లూజర్స్ గా నిలిచాయి.