Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
Stock Market: కొత్త వారం కూడా మార్కెట్లు పాత దారిలోనే పయనిస్తున్నాయి. సోమవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ఎస్జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్ నోట్ లో ఉండటంతో ఈ రోజు మార్కెట్లు సానుకూలంగా ఉంటాయని అందరూ భావించారు. కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ప్రారంభమయ్యాయి.
సూచీలు పేలవంగా..
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 69 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 103 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఆరంభ నష్టాల నుంచి సూచీలు కేవలం కొన్ని నిమిషాల్లోనే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చేశాయి.
టాప్ గెయినర్స్..
NSE సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐఎన్, ఎన్టీపీసీ, మారుతీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఐటీసీ, విప్రో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
టాప్ లూజర్స్..
ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, సిప్లా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.