Stock Market: దూకుడుమీదున్న దేశీయ మార్కెట్లు.. సరికొత్త గరిష్ఠానికి సెన్సెక్స్ సూచీ..
Stock Market: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఎన్నడూ చూడని వేగంతో తమ జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు సెన్సెక్స్ సూచీ 63583 సరికొత్త రికార్డు గరిష్ఠాన్ని తాకింది. అయితే చైనాలో పెరుగుతున్న నిరసనలు, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ వైఖరి వంటి కీలక విషయాలు దీనికి దోహదపడుతున్నాయి.
ప్రపంచానికి భిన్నంగా..
ప్రస్తుత ప్రపంచ అస్థిరతల్లో చాలా మంది విదేశీ మదుపరులు భారత మార్కెట్లపై నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగటం భారత మార్కెట్లకు కలిసొస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. అందుకే అమెరికాతో పాటు మరికొన్ని వృద్ధిచెందిన మార్కెట్లలో పతనం కొనసాగుతున్నప్పటికీ మన మార్కెట్లు మాత్రం బుల్ జోరును కొనసాగిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
క్లోజింగ్ సమయానికి సూచీలు..
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ సూచీ 29 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 246 పాయింట్ల లాభంలో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 63284 పాయింట్ల వద్ద ఉంది.
టాప్ గెయినర్స్..
మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కొ, టాటా స్టీల్, గ్రాసిమ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హీరో మోటొకార్ప్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో నిలుస్తూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
టాప్ లూజర్స్..
మార్కెట్ ముగిసే సమయానికి యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.