Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్ సూచీలు.. ప్రారంభమైన ధర్మజ్ ఐపీవో..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభ సమయంలో సెన్సెక్స్ సూచీ దాదాపు 200 పాయింట్ల నష్టంతో మెుదలైంది. అయితే కొద్ది సేపట్లోనే కోలుకున్న కీలక సూచీలు స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 18500 మార్క్ కింద తన ప్రయాణాన్ని ఆరంభంలో ప్రారంభించింది.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 18 పాయింట్ల లాభంలో ఉంది. మరో పక్క బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 38 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 186 పాయింట్ల లాభంలో ఉంది.
ఈ క్రమంలో హీరో మోటొకార్ప్, బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు టాప్ గెయినర్స్ గా ఎన్ఎస్ఈలో నిలిచాయి. కాగా.. హిందాల్కొ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈరోజు మార్కెట్లో ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ ఆయిల్, హీరో మోటొకార్ప్ షేర్లు వార్తల్లో నిలవగా ఫోకస్ లో ఉన్నాయి. ఇదే క్రమంలో ధర్మజ్ క్రాప్ గార్డ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో ఈరోజు ప్రారంభమైంది. ఐపీవో నవంబర్ 30, 2022న ముగుస్తుంది. ఈ ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.216 నుంచి రూ.237గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ధరతో పాటు కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై మార్కెట్ అనలిస్టులు పాజిటివ్ గా ఉన్నారు.