Bull Close: సూపర్ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ- అందరి చూపు ఆర్బీఐ వైపు..
Market Closing: ప్రస్తుతం ఆర్బీఐ సమావేశాలు కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్ల చూపు రేపు ప్రకటించనున్న వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా రెండు రోజుల పతనానికి నేడు జపాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన బ్రేక్ వేయటంతో బుల్స్ తిరిగి రంగంలోకి దిగారు.
మార్కెట్ల ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 875 పాయింట్లు, నిఫ్టీ సూచీ 305 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 371 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1358 పాయింట్ల పెరుగుదలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. సానుకూల ప్రపంచ సంకేతాలు సెంటిమెంట్ను పెంచడంతో చాలా అవసరమైన విశ్రాంతిలో, బెంచ్మార్క్ సూచీలు రోజును బలమైన పునాదితో ముగించాయి. నిఫ్టీ, సెన్సెక్స్లు మూడు రోజుల పాటు నష్టాల పరంపరను ముగించాయి. అమెరికా మాంద్యం భయాలు, యెన్ క్యారీ ట్రేడ్ను తగ్గించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా స్థిరత్వం వైపుకు దూసుకుపోతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

ఈ క్రమంలో మిడ్ అండ్ స్మాల్క్యాప్ ఇండెక్స్ను కలిగి ఉన్న విస్తృత మార్కెట్, రోజును బుల్లిష్ నోట్తో ముగించింది. NSEలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కొ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్టి, ఎల్టిఐఎమ్, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications