Market Closing: ప్రస్తుతం ఆర్బీఐ సమావేశాలు కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్ల చూపు రేపు ప్రకటించనున్న వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా రెండు రోజుల పతనానికి నేడు జపాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన బ్రేక్ వేయటంతో బుల్స్ తిరిగి రంగంలోకి దిగారు.
మార్కెట్ల ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 875 పాయింట్లు, నిఫ్టీ సూచీ 305 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 371 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1358 పాయింట్ల పెరుగుదలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. సానుకూల ప్రపంచ సంకేతాలు సెంటిమెంట్ను పెంచడంతో చాలా అవసరమైన విశ్రాంతిలో, బెంచ్మార్క్ సూచీలు రోజును బలమైన పునాదితో ముగించాయి. నిఫ్టీ, సెన్సెక్స్లు మూడు రోజుల పాటు నష్టాల పరంపరను ముగించాయి. అమెరికా మాంద్యం భయాలు, యెన్ క్యారీ ట్రేడ్ను తగ్గించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా స్థిరత్వం వైపుకు దూసుకుపోతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

ఈ క్రమంలో మిడ్ అండ్ స్మాల్క్యాప్ ఇండెక్స్ను కలిగి ఉన్న విస్తృత మార్కెట్, రోజును బుల్లిష్ నోట్తో ముగించింది. NSEలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కొ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్టి, ఎల్టిఐఎమ్, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications