భారతీయుల అభిరుచులు మారుతున్నాయి. తమకు నచ్చిన వస్తువులు ఎక్కడ ఉన్నా వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. డబ్బుల విషయంలో వెనుకాడే ప్రసక్తే ఉండదు. ఈ- కామర్స్ వెబ్ సైట్లు వచ్చిన తర్వాత పల్లెల్లో ఉన్న వారు కూడా తమకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిన ఫలితంగా షాపింగ్ మరింత ఈజీగా మారిపోయింది. అసలు విషయం ఏమిటంటే మనదేశంలోని ప్రతి ఇద్దరు మొబైల్ షాపర్స్ లో ఒకరు విదేశీ వెబ్ సైట్లలో కొనుగోళ్లు చేస్తున్నారు. దేశంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో సగం మంది విదేశీ వెబ్ సైట్ల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని డిజిటల్ పెమెంట్స్ సంస్థ పేపాల్ తాజా నివేదిక వెల్లడించింది.
మొబైల్ కామర్స్ లో మనదే హవా
* ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మొబైల్ కామర్స్ లో భారత్ హవా సాగుతోంది. మన దేశంలోని 88 శాతం మంది ఆన్ లైన్ చెల్లింపుల కోసం మొబైల్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. 81 శాతం మంది భారత వ్యాపారాలు మొబైల్ షాపింగ్ కు అనుగుణంగా మారిపోయారు.
* ఈ అధ్యయనాన్ని ప్రపంచవ్యాప్తంగా 11 మార్కెట్లో నిర్వహించారు. ఇందులో 22,000 మంది కస్టమర్లు, 4,602 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి.
* అధ్యయనంలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది క్రాస్ బోర్డర్ షాపింగ్ చేస్తున్నట్టు తెలిపారు.

అవరోధాలున్నాయి..
* గత ఆరు నెలల్లో భారత వ్యాపార సంస్థలు తమ అమ్మకాల్లో అంతర్జాతీయ కస్టమర్ల నుంచి 47 శాతం పొందాయి. ఉత్పత్తుల్లో నాణ్యత, ఆసక్తి కరమైన ఉత్పల్లుడు ఉండటం వంటివి ఇందుకు దోహదపడినాయి. అయితే సరుకుల రవాణా వ్యయాలు, డెలివరీకి తీసుకునే సమయం, సుంకాలపై స్పష్టత లేకపోవడం, రిటర్న్ షిప్పింగ్ వ్యయాలు వంటివి అంతర్జాతీయ షాపింగ్ కు అవరోధాలుగా మారుతున్నాయి.
అన్నింటికీ మొబైల్ ఫోన్...
* మొబైల్ షాపింగ్ చేసే వారిలో అధిక శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. మిల్లీనియల్స్ మొబైల్ షాపర్స్ లో 47 శాతం మంది తమ మొబైల్స్ ద్వారా యాదృచ్చికంగా కొనుగోళ్లు చేస్తున్నారు.
* దేశంలోని వ్యాపారస్థులో 39 శాతం మంది మొబైల్ యాప్ లను కలిగి ఉన్నారు. ప్రపంచ సగటు 24 శాతంగా ఉంది. ఆన్ లైన్ అమ్మకాల్లో 51 శాతం మొబైల్ యాప్ ల ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచ సగటు 41 శాతంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications