భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు, వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. అయితే ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ లగేజీ నిబంధనలలో భారీ మార్పులు చేస్తోంది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. విమాన ప్రయాణాల తరహాలో రైళ్లలో కూడా లగేజీని తనిఖీ చేసి, పరిమితి మించిన వారికి ఛార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.

ఏ క్లాస్లో ఎంత లగేజీ ఫ్రీ?
రైల్వే శాఖ విడుదల చేసిన తాజా పట్టిక ప్రకారం.. వివిధ క్లాసుల్లో ప్రయాణించే వారికి అనుమతించబడిన ఉచిత లగేజీ, మ్యాగ్జిమమ్ లగేజీ లిమిట్స్ ఇలా ఉన్నాయి.
AC ఫస్ట్ క్లాస్ (AC First Class): ప్రయాణికులు 70 కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఎక్స్ట్రా ఛార్జీ చెల్లించి గరిష్టంగా 150 కేజీల వరకు తీసుకెళ్లొచ్చు.
AC 2 టైర్ లేదా ఫస్ట్ క్లాస్ (AC 2 Tier / First Class): ఇందులో 50 కేజీల వరకు ఉచితంగా అనుమతిస్తారు. అదనపు ఛార్జీలతో గరిష్టంగా 100 కేజీల వరకు సామాన్లను తీసుకువెళ్లొచ్చు.
AC 3 టైర్ లేదా చైర్ కార్ (AC 3 Tier / Chair Car): ప్రయాణికులు 40 కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ తరగతిలో గరిష్ట పరిమితి కూడా 40 కేజీలుగానే నిర్ణయించారు.
స్లీపర్ క్లాస్ (Sleeper Class): ఇందులో 40 కేజీల వరకు ఉచిత లగేజీకి అనుమతి ఉంటుంది. ఎక్స్ట్రా ఛార్జీ చెల్లిస్తే గరిష్టంగా 80 కేజీల వరకు అనుమతిస్తారు.
సెకండ్ క్లాస్ - జనరల్ (Second Class): ప్రయాణికులు 35 కేజీల వరకు ఉచితంగా సామాన్లను తీసుకెళ్లొచ్చు. అదనపు రుసుముతో గరిష్టంగా 70 కేజీల వరకు అనుమతి ఉంటుంది.
లిమిట్ దాటిన తర్వాత: ఉచిత పరిమితి దాటిన తర్వాత.. గరిష్ట పరిమితి వరకు లగేజీని తీసుకెళ్లాలంటే సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లగేజీ సైజుపై కూడా నిబంధనలు!
కేవలం బరువే కాదు, మీరు తీసుకెళ్లే సామానుల సైజు కూడా నిర్ణీత పరిమితిలో ఉండాలి.
ట్రంకులు, సూట్కేసులు లేదా బాక్సులు గరిష్టంగా 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ (పొడవు x వెడల్పు x ఎత్తు) పరిమాణంలో ఉండాలి. ఒకవేళ ఈ సైజు కంటే పెద్దగా ఉంటే.. వాటిని కంపార్ట్మెంట్లో ఉంచడానికి అనుమతించరు. వాటిని ప్రత్యేకంగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్ లేదా పార్సిల్ వ్యాన్ లో పంపాల్సి ఉంటుంది.
ముఖ్యమైన ఇతర నిబంధనలు
వ్యాపార వస్తువులు (Merchandise): వ్యక్తిగత లగేజీగా వ్యాపార వస్తువులను కంపార్ట్మెంట్లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది.
బోర్డింగ్ పాస్ తరహాలో టికెట్:డిసెంబర్ 2026 నాటికి ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో 'బోర్డింగ్ పాస్' విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లగేజీని ఎలక్ట్రానిక్ యంత్రాలతో తూకం వేసిన తర్వాతే ప్లాట్ఫారమ్ మీదకు అనుమతిస్తారు.
సెక్యూరిటీ చెక్: లగేజీ పరిమితిని పర్యవేక్షించడమే కాకుండా ప్రయాణికుల భద్రత కోసం డిజిటల్ స్కానింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications