Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టిక్కెట్ ధరలు 25 శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు
Railways: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. అసలే అన్నింటి రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలు అధిక ఛార్జీలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల నుంచి ఆదరణ తగ్గటంతో రైళ్లలో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాసుల టికెట్ ధరలను 25% వరకు తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి జోనల్ రైల్వేలకు అధికారం కల్పించింది. విస్టాడోమ్ కోచ్లతో సహా AC సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్ల ఈ పథకం వర్తిస్తుంది. అలాగే వెంటనే అమలు చేయబడుతుంది.

తాజా నిర్ణయం ద్వారా బేర్ఫేర్పై 25% వరకు తగ్గింపు లభించనుంది. అయితే రిజర్వేషన్ ఫీజులు, సూపర్-ఫాస్ట్ సర్ఛార్జ్లు, GST మొదలైన ఛార్జీలు విడిగా విధించబడతాయి. గడచిన 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లును తాజా స్కీమ్ కింద పరిగణించబడతాయి. అయితే పోటీతత్వ రవాణా మార్గాల ధరలు తగ్గింపును నిర్ణయించడానికి బెంచ్మార్క్గా పనిచేస్తాయి. అయితే ఈ ప్రకటనకు ముందు చేసుకున్న రిజర్వేషన్లకు రూల్స్ వర్తించవని తెలుస్తోంది. వారికి ఎలాంటి డబ్బు వాపసులు లభించవు. ఖాళీగా వెళుతున్న రైళ్లలో ఆక్యుపెన్సీ పెంచటమే తాజా నిర్ణయం వెనుక అసలు కారణమని వెల్లడైంది.

అయినప్పటికీ చాలా మంది పౌరులు మంత్రిత్వ శాఖ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరిగి చెల్లించలేని ఛార్జీల నిబంధనలపై. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లకు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఇది చాలా మంది ప్రయాణికులకు ప్రతికూలతను కలిగిస్తుందని సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications