భారతదేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వీరులకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప గౌరవాన్ని ప్రకటించింది. గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనికులు , వారి కుటుంబ సభ్యులకు భారతీయ రైల్వేలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తూ గురువారం కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే భారీ ధరలు పెట్టి ట్రైన్ టికెట్స్ (Train tickets) కొంటాం. కానీ, ఇప్పుడు ఈ ప్రత్యేక విభాగం వారికి ఆ అవసరం ఉండదు.

ఎవరెవరు అర్హులు? (Eligibility Details)
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ క్రింది గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు ఉచిత ప్రయాణానికి అర్హులు..
- సేన మెడల్ (Sena Medal) పొందిన వారు.
- నౌ సేన మెడల్ (Nau Sena Medal) గ్రహీతలు.
- వాయు సేన మెడల్ (Vayu Sena Medal) గ్రహీతలు.
వీరితో పాటు వారి జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఒకవేళ అవార్డు గ్రహీత మరణిస్తే, వారి భార్య లేదా భర్త (పునర్వివాహం చేసుకోనంత వరకు) ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అలాగే, పెళ్లి కాని అమరవీరుల తల్లిదండ్రులు కూడా ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఏ కోచ్లలో ప్రయాణించవచ్చు?
అర్హులైన వారు ఒక తోడు (Companion) తో కలిసి భారతీయ రైల్వేలోని ఈ క్రింది తరగతుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు..
- ఫస్ట్ క్లాస్ (First Class)
- 2 AC (సెకండ్ ఏసీ)
- AC చైర్ కార్ (AC Chair Car)
అగ్నివీర్లు, మాజీ సైనికులకు ఉద్యోగాల జాతర
ఉచిత ప్రయాణంతో పాటు, పదవీ విరమణ చేసిన సైనికులకు , అగ్నివీర్లకు రైల్వేలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం ఇండియన్ ఆర్మీ , రైల్వే శాఖ మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది.
- రిజర్వేషన్లు: లెవల్-1 పోస్టుల్లో మాజీ సైనికులకు 20%, అగ్నివీర్లకు 10% రిజర్వేషన్ కల్పించారు. లెవల్-2 , అంతకంటే పై స్థాయి పోస్టుల్లో వరుసగా 10% , 5% కోటాను కేటాయించారు.
- భారీ వేకెన్సీలు: 2024 , 2025 సంవత్సరాల్లో మొత్తం 14,788 పోస్టులను మాజీ సైనికుల కోసం కేటాయించినట్లు రైల్వే శాఖ తెలిపింది.
- కాంట్రాక్ట్ నియమకాలు: రెగ్యులర్ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు మాజీ సైనికులను 'పాయింట్స్మెన్ (Pointsmen)'గా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించారు.
దేశ సేవలో నిమగ్నమైన వారిని గౌరవించడం , వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం కోసం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతో ప్రశంసనీయం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఈ అవార్డులు పొంది ఉంటే, వెంటనే రైల్వే వెబ్సైట్లో పూర్తి వివరాలు చూసుకుని ఈ ప్రయోజనాన్ని పొందండి. ఇకపై వారు ఎక్కడికైనా వెళ్లాలంటే పాత పద్ధతిలో ట్రైన్ టికెట్స్ (Train tickets) కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications