Indian Railways: దేశంలో చాలా మంది తమ ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలను వినియోగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో పాటు ప్రయాణ వెసులుబాటును అందించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
అయితే ఇటీవల దేశవ్యాపంగా రైల్వే ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఒడిశాలో జరిగిన అతిపెద్ద ప్రమాదం చాలా మంది ప్రాణాలను బలిగొంది. ఈ క్రమంలో రైల్వే బోర్డు ప్రమాద బాధితులకు అందించే పరిహారాన్ని పెంచాలని నిర్ణయించింది. 2012-13 తర్వాత తొలిసారిగా రైల్వే బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంది.

రైలు లేదా మనుషుల లెవెల్ క్రాసింగ్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియాను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో రూ.50 వేలుగా ఉన్న పరిహారాన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. అలాగే రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు గతంలో చెల్లిస్తున్న రూ.25 వేల పరిహారాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. తక్కువ తీవ్రత కలిగిన గాయాలకు గురైతే గతంలో ఇస్తున్న రూ.5 వేల పరిహారానికి బదులు రూ.50,000 చెల్లించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే ప్రాథమిక బాధ్యత కారణంగా ప్రమాదాలకు గురైన రహదారి వినియోగదారులకు సవరించిన ఎక్స్-గ్రేషియా ఉపశమనాన్ని సర్క్యులర్ పొడిగించింది. అలాగే ఉగ్రవాద దాడులు, హింసాత్మక దాడులు, రైలు దోపిడీలు వంటి నేరాలుగా వర్గీకరించారు. ఈ సందర్భాల్లో ప్రాణాంతక గాయాలతో బాధపడే ప్రయాణికులపై ఆధారపడిన వారికి రూ.1.5 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 50,000, స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ.5,000 అందించాలని బోర్డు నిర్ణయించింది.
రైలు ప్రమాదాల కారణంగా 30 రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స పొందే ప్రయాణికులకు రోజుకు రూ.3,000 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మెుత్తం ప్రతి 10 రోజుల వ్యవధి ముగింపులో లేదా డిశ్చార్జ్ అయిన తర్వాత ఏది ముందు జరిగితే అప్పుడు విడుదల చేయబడుతుంది. అలాగే అవాంఛనీయ సంఘటనల సమయంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు ఆసుపత్రిలో చేరిన ఆరు నెలల వరకు ఇలాంటి పరిస్థితులలో రోజుకు రూ.1,500 అందుకుంటారు. ఆ తర్వాత ఐదు నెలలు రోజుకు రూ.750 చొప్పున పొందుతారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications