NRI News: అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు ఇమ్మిగ్రెంట్లను ప్రధానంగా భారతీయ కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆర్డినెన్స్ పాస్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో న్యాయపోరాటం కూడా కొనసాగుతోంది. కానీ భారతీయుల్లో మాత్రం భయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ట్రంప్ ఆర్డినెన్స్ ఫిబ్రవరి 20, 2025 నుంచి అమలులోకి వస్తుందనే భయంతో భారతీయ రెసిడెంట్లు ఆందోళ చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ ప్రెగ్నెంట్ మహిళలు ముందుగానే సీసెక్షన్ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అమెరికాలోని చాలా ఆసుపత్రుల్లో దీని వల్ల ప్రస్తుతం రద్దీ పెరిగిపోయిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత యూఎస్లో H1B, L1 వీసాలపై నివసిస్తున్న మహిళలు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆతృతగా ఉన్నారు.

ఒకవేళ కొత్త చట్టం అమలులోకి వస్తే తాత్కాలిక వీసాలపై ఉద్యోగం లేదా ఇతర కారణాలతో అమెరికాలో ఉన్న జంటలకు పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాబోదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. కొత్త చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రుల్లో ఒక్కరైనా అమెరికన్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అవటం తప్పనిసరి. లేనిపక్షంలో పుట్టిన పిల్లలు 21 ఏళ్లు నిండినప్పుడు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక వర్క్ వీసాలపై నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ప్రస్తుత మార్పులు ఆందోళనలను పెంచేస్తున్నాయి.
వైద్య నిపుణులు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్సాస్లో ప్రసూతి వైద్యుడు డాక్టర్ SG ముక్కాల మాట్లాడుతూ ముందస్తుగా సీసెక్షన్ ఆపరేషన్ల ద్వారా పిల్లలకు జన్మనివ్వటం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాల గురించి హెచ్చరించారు. దీనివల్ల పిల్లలో ఫీడింగ్ సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఇది చూస్తుంటే ఆరోగ్యకరమైన పిల్లల కంటే పుట్టిన వారు అమెరికన్లుగా ఉండాలని దంపతులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
నెలలు నిండక ముందే పిల్లలకు జన్మనివ్వటం అనారోగ్యకరమైన శిశువులు పుట్టటానికి కారణం అవుతుందని వైద్య నిపుణులు దంపతులను హెచ్చరిస్తున్నారు. 1868లో ఆమోదించబడిన యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ నుండి జన్మహక్కు పౌరసత్వం వచ్చింది. యూఎస్ గడ్డపై పుట్టిన ఎవరైనా స్వయంచాలకంగా పౌరసత్వం పొందుతారని పౌరసత్వ నిబంధన హామీ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో దీనిని ముగించాలని ట్రంప్ తీసుకున్న చర్య రాజ్యాంగ చర్చలకు దారితీసింది. ఈ క్రమంలోనే విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను కూడా మానేస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications