Markets Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు యూనియన్ బడ్జెట్ తర్వాత సోమవారం తెరచుకున్నాయి. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున శనివారం కావటంతో మార్కెట్లను ప్రత్యేకంగా ట్రేడింగ్ కోసం తెరచి ఉంటారు. అయితే ఈ రోజు ఫ్లాట్ ముగింపును చూసిన తర్వాత నేడు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల మధ్య తమ ప్రయాణాన్ని కొత్త వారంలో ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 704 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 205 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 378 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 332 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి. వాస్తవానికి గ్లోబల్ మార్కెట్లు కూడా కొంత మేర నెగటివ్ గా ట్రేడింగ్ కొనసాగించటం కూడా ఇండియన్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తోంది.

ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ టాప్ లూజర్ల జాబితాలో హిందాల్కో మెుదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రధానంగా అమెరికా ఫెడ్ ఎంపీసీ పాలసీ ప్రకటన తర్వాత వచ్చిన బడ్జెట్ కూడా ముగియటంతో.. ఫిబ్రవరి 7, 2025న నిర్వహించబడనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీపైనే ప్రధానంగా ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. అయితే రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశావాదం పెట్టుబడిదారుల్లో కనిపిస్తోంది.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసిన కీలక అంశాల్లో ముందువరుసలో ఉన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం. వాస్తవానికి ట్రంప్ చైనా, కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన తర్వాత గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే ట్రంప్ చర్యలతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కెనడా చెబుతోంది. తాము కూడా అదే స్థాయిలో అమెరికా దిగుమతులపై సుంకాన్ని విధించనున్నట్లు వెల్లడించటం వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావటానికి ఆర్జ్యం పోస్తోంది.
గ్లోబల్ మార్కెట్ల పనితీరు..
డొనాల్డ్ ట్రంప్ చర్యల తర్వాత ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం క్షీణతతో ముందుకు సాగుతున్నాయి. జపాన్కు చెందిన నిక్కీ సూచీ 1.84% క్షీణించగా, టాపిక్స్ 1.75% నష్టపోయింది. ఇదే క్రమంలో సౌత్ కొరియా మార్కెట్ సూచీలు కోస్పి 2.32%, కోస్డాక్ 1.9% నష్టాలను చూశాయి. అయితే చైనా స్టాక్ మార్కెట్లు మాత్రం ప్రస్తుతం సెలవులో ఉన్నాయి. ఇదే క్రమంలో అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు ట్రంప్ పరిపాలన పోకడులు, రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశం, క్యూ3 ఫలితాలు, ఐపీవో మార్కెట్, విదేశీ మదుపరుల తీరుతెన్నులు, ముడి చమురు ధరలపై ప్రధానంగా తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications