Salary Hikes: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తాయోనని ఉద్యోగులు కొంత కాలంగా గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం పెద్ద శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచటం, వారి వేతనాలను రెట్టింపు చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ జీతాల విషయంలో ఉన్న అసమానతలను తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. కరోనా తర్వాత అట్రిషన్ భారీగా పెరగిన తరుణంలో కొత్త నియామకాలకు ఎక్కువ వేతనాలు ఆఫర్ చేయటం కంటే ఉద్యోగులకు మంచి హైక్స్ ఇవ్వటం ఉత్తమంగా భావిస్తోంది.

కరోనా వల్ల పెరిగిన ఐటీ ఉద్యోగుల డిమాండ్ కారణంగా ఒక కంపెనీలో ఉద్యోగులు మరో కంపెనీలో ఎక్కువ శాతం జీతం ఆఫర్ చేస్తున్నారంటూ కంపెనీలు మారుతూ వచ్చారని TCS ముఖ్య మానవ వనరుల అధికారి(CHRO) మిలింద్ లక్కడ్ అన్నారు. అయితే ప్రస్తుతం కంపెనీ అంతర్గతంగా ఉద్యోగుల్లో ఉన్న జీతాల అసమానతను తగ్గించేందుకు పరిహారాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా అప్గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని పొందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఉద్యోగుల అట్రిషన్ రేటు పెరుగుతున్న సమయంలో వారి జీతం రెండింతలు అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ.. కంపెనీలోని వివిధ ప్రోగ్రాముల్లో ఎక్కువ మందిని ప్రవేశపెడుతోంది. వీటిని క్లియర్ చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు ఏడాదికి కేవలం 10 శాతంగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 150 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉండగా.. వారిలో మహిళల సంఖ్య దాదాపు 35.7 శాతమని కంపెనీ వెల్లడించింది.
మార్తి 31, 2023 చివరి నాటికి కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,795గా ఉంది. ఇది అంతకు ముందు ఏడాది కంటే కొంత తక్కువ. ప్రస్తుతం ఉద్యోగుల అట్రిషన్ రేటు క్రమంగా తగ్గుతూ 20.1 శాతంగా ఉంది. ఇటీవల విడుదలైన నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం 14.8 శాతం పెరిగి రూ.11,436 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ నివేధించింది. అయినప్పటికీ ఐటీ దిగ్గజం మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications