Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా? ఐటీ స్టాక్స్ కోలుకోవడం సాధ్యమేనా?

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం ఒక పెద్ద కుదుపుకు లోనవుతోంది. కేవలం గత 8 ట్రేడింగ్ సెషన్లలోనే ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 19% మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్స్ (IT Stocks) నుండి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి?

Indian IT industry market cap wipeout in 8 days due to Anthropic effect AI disruption and IT Stocks valuation reset

భయపెడుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI)

ఐటీ రంగంలో పతనానికి ప్రధాన కారణం ఏఐలో వస్తున్న పెను మార్పులు. 'అంత్రోపిక్' (Anthropic) అనే సంస్థ విడుదల చేసిన 'క్లాడ్ 4.6' (Claude 4.6) , 'కోవర్క్' (Cowork) వంటి ఏఐ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ ను అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తున్నాయి.

  • మారిన లెక్కలు: గతంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 100 మంది అవసరమైతే.. ఇప్పుడు ఏఐ సాయంతో కేవలం 10-20 మందితోనే ఆ పని పూర్తవుతోంది.
  • బిజినెస్ మోడల్ మార్పు: భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 'ఎంత మంది పని చేస్తున్నారు' (Headcount) అనే దానిపై ఆదాయం పొందేవి. కానీ ఇప్పుడు క్లయింట్లు 'పని ఎంత త్వరగా పూర్తయింది' (Outcome based pricing) అనే దానిపైనే డబ్బులిస్తామని చెబుతున్నారు. దీనినే మార్కెట్ నిపుణులు 'SaaSpocalypse' అని పిలుస్తున్నారు.

అగ్రశ్రేణి కంపెనీల పరిస్థితి ఎలా ఉంది?

ఈ అమ్మకాల సునామీలో ఏ కంపెనీ కూడా తప్పించుకోలేకపోయింది. గత 8 రోజుల్లో వివిధ కంపెనీల షేర్ల పతనం ఇలా ఉంది..

  • ఇన్ఫోసిస్ (Infosys): 21% పతనం
  • టీసీఎస్ (TCS): 19% పతనం (దీని మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్ల కంటే కిందకు పడిపోయింది)
  • హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech): 17% పతనం
  • విప్రో, టెక్ మహీంద్రా: 13% పతనం

దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే వార్తలు కూడా ఐటీ షేర్లపై ఒత్తిడిని పెంచాయి.

ఇది ముగింపా లేక కొత్త ఆరంభమా?

చాలా మంది ఇన్వెస్టర్లు ఐటీ రంగం పని అయిపోయిందని భయపడుతున్నారు. కానీ, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక 'రీసెట్' (Valuation Reset) మాత్రమే.

  1. టెక్నాలజీ మారుతోంది: గతంలో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు కూడా ఐటీ రంగం అంతమవుతుందని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత అది మరింత వృద్ధి చెందింది. ఇప్పుడు ఏఐ కూడా అలాగే కొత్త అవకాశాలను తీసుకురావచ్చు.
  2. అన్ని కంపెనీలు ఒకటి కాదు: ఏఐని అందిపుచ్చుకుని, తమ పని తీరును మార్చుకునే కంపెనీలు నిలబడతాయి. పాత పద్ధతుల్లోనే ఉంటామనే కంపెనీలు నష్టపోతాయి.
  3. డివిడెండ్ ఆకర్షణ: షేర్ల ధరలు తగ్గడంతో.. డివిడెండ్ ఈల్డ్ (Dividend Yield) ఇప్పుడు దాదాపు 3% కి పెరిగింది. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం కావొచ్చు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

ప్రస్తుతానికి ఐటీ మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. కాబట్టి కంగారు పడి ఒక్కసారిగా అన్ని డబ్బులు పెట్టేయడం లేదా భయంతో ఉన్నవన్నీ అమ్మేయడం మంచిది కాదు. క్వాలిటీ ఉన్న , మంచి నగదు నిల్వలున్న కంపెనీల షేర్లను ధర తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా (SIP పద్ధతిలో) కొనుగోలు చేయడం శ్రేయస్కరం. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం అత్యుత్తమ మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+