IT Hirings: ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న చాలా మంది టెక్ ఉద్యోగులకు ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయ్. ఎప్పుడు తమ కంపెనీ లేఆఫ్ మెయిల్ పంపుతుందో అని కంగారుగా ఉంటున్నారు. దీని వెనుక కారణాలు ఆందోళనల కలిగిస్తున్నాయి.
ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు ఉద్యోగులను లేఆఫ్ చేసి పారేస్తున్నాయి. అయితే ఇండియాలోని ఐటీ రంగంలో పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దేశీయ ఐటీ సేవల కంపెనీలు ఇక్కడి ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లకు సంతోషాన్ని కలిగించి శుభవార్తను మాత్రం ప్రకటించటం లేదు. అవును రిక్రూట్మెంట్ల విషయంలో కంపెనీలు కఠినంగా ఉన్నాయి. ఐఐటీ, ఐఐఎమ్ వంటి దిగ్గజ విద్యా సంస్థల్లో స్వల్ప రిక్రూట్మెంట్స్ ధోరణి కొనసాగుతోంది.

ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం భారతీయ ఐటీ రంగంలోని కంపెనీల రిక్రూట్మెంట్ 20 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని షాకింగ్ నివేదికలు బయటకు వచ్చాయి. ఏడాదిలో దేశీయంగా టెక్ కంపెనీలు 70,000-80,000 ఉద్యోగులను మాత్రమే నియమించుకోవటం అత్యంత తక్కువ నియామకాలను నమోదు చేసింది. అయితే కరోనా సమయమైన 2022 టెక్ ఉద్యోగులకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి బూమ్ ఏర్పడిన కాలం. ఆ సమయంలో దేశంలోని టెక్ సంస్థలు రికార్డు స్థాయిలో 6 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
ఆ తర్వాత 2023లో సైతం దేశీయంగా ఫ్రెషర్ల నియామకం దాదాపు 2.50 లక్షలకు చేరుకున్నాయి. అయితే ఏడాది చివరి త్రైమాసికాల్లో పరిస్థితులు, ఆదాయాలు దిగజారటంతో చాలా కంపెనీలు కొత్త నియామకాలను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ వంటి పేరున్న సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లకు దూరంగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో టైర్-2 నగరాల్లోని ప్రతిభావంతులైన టెక్ ఉద్యోగ ఆశావహులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications