IT News: గడచిన కొన్ని సంవత్సరాలుగా ఐటీ బూమ్ పీక్స్ కు చేరుకుంది. ఎవరిని ముట్టుకున్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కారం చెల్లిపోయింది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీయ టెక్ కంపెనీలు అత్యంత గడ్డు కాలాన్ని చూస్తున్నాయి. వస్తున్న ఆదాయాలకు తగ్గుతున్న మార్జిన్లు తోడుకావటంతో పాటు పెరిగిన ఉద్యోగుల ఖర్చులతో కంపెనీలు రూటు మార్చేశాయి. ఈ క్రమంలో జీతాల పెంపుల కోసం కంపెనీలు మారే టెక్కీలకు కళ్లెం వేస్తున్నాయి.

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి టాప్ టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ.. కొత్త నియామకాలను దాదాపుగా తగ్గించేశాయి. దీంతో అట్రిషన్ రేటు తగ్గింది. చాలా మంది ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కంపెనీల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఐటీ రంగంలో వేతన పెంపులు 7-12 శాతం మధ్య ఉంటాయి. అయితే కరోనా కాలంలో టెక్కీలకు డిమాండ్ పెరగటం వల్ల కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించేందుకు వారి పాత జీతంపై 30-40 శాతం పెంపును ఆఫర్ చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం జీతాల పెంపు కోసం కంపెనీలు మారే ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
కంపెనీలు సైతం ఖర్చుల మదింపులో భాగంగా ఎక్కువ వేతనాలను ఆఫర్ చేసేందుకు సుముఖంగా లేవని పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి తక్కువ జీతానికైనా ఉద్యోగం దొరికితే చాలని ఫ్రెషర్లు, రెసిషన్ లో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు అనుకుంటున్నారు. టీసీఎస్ వంటి కంపెనీలు వార్షిక వ్యాపారంలో 440 మిలియన్ డాలర్లు నష్టపోతున్నందున కొత్త ఉద్యోగులను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఐటీ రంగంలో మొత్తం ఉపాధి తగ్గింది. గత కొన్ని నెలలుగా GCC కంపెనీలు మాత్రమే టెక్ ఉద్యోగులను నియమించుకున్నాయి.

ప్రస్తుతం లేబర్ మార్కెట్లో టెక్ వర్కర్ల సప్లై పెరిగినప్పటికీ.. ఖాళీల సంఖ్య తక్కువగానే ఉన్నాయి. దీంతో కొత్త కంపెనీలోకి మారే ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న హైక్స్ సగానికి పైగా పడిపోయాయి. ప్రస్తుతం కంపెనీలు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డైటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు, క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి నిపుణులకు మాత్రమే మెరుగైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు కొత్త ప్రాజెక్టులు తగ్గటంతో అనేక మంది ఉద్యోగులను బెంచ్ పై కొనసాగిస్తున్నాయి. పరిస్థితులు రానున్న త్రైమాసికాల్లో వేగంగా మారకపోతే కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత తప్పదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications