Stock Market: మోదీ 3.0 కేంద్రంలో పరిపాలన మెుదలుపెట్టి కొద్ది రోజులు అవుతోంది. అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ రెండు ప్రతికూలతలతో పోరాడుతున్న సంచలన నివేదికల ద్వారా వెల్లడైంది. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇది పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి.
వాస్తవానికి ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్ కావటానికి ప్రైవేటు పెట్టుబడులు చాలా కీలకమైనవి. అయితే నిజానికి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇండియన్ ఎకానమీ పెడ్డుబడుల తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. మెుదటి త్రైమాసికంలో ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టుల విలువ 92% క్షీణించి రూ.59,900 కోట్లకు పడిపోయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2009 తర్వాత ప్రైవేటు పెట్టుబడులు ప్రస్తుతం అత్యల్ప స్థాయిలకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడి సెంటిమెంట్ తక్కువగా ఉండటతో పాటు కొన్ని రంగాల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ కేంద్రీకృతమై ఉన్నాయి.

FY25లో ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నప్పటికీ, మొత్తం పెట్టుబడి కార్యకలాపాలు గతంలో లాగా ప్రభుత్వ పెట్టుబడులపై ఆధారపడి ఉండవచ్చని తెలుస్తోంది. పెట్టుబడిదారులకు భారతదేశం కూడా లాభదాయకమైన మార్కెట్లలో ఒకటిగా ఉంది. అయితే కంపెనీలు రిస్క్ తీసుకునే మూడ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. బహుశా ప్రైవేట్ వినియోగం సింగిల్ డిజిట్లో పెరగడం వల్ల కావచ్చు. ప్రత్యేకించి గ్రామీణ డిమాండ్ అవసరమైన వేగాన్ని అందుకోలేదు. అయితే పట్టణాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. FY23లో పెట్టుబడులు GDPలో 10.9%గా ఉండగా.. FY08లో 16.8% గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంది.
అలాగే రెండో చేదు వార్తను పరిశీలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ 7% వేగంతో వృద్ధి చెందినప్పటికీ.. వచ్చే దశాబ్దంలో ఇండియాలో పెరుగుతున్న శ్రామికశక్తికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి భారత్ కష్టపడుతుందని సిటీ గ్రూప్ పేర్కొంది. ఇది నిరుద్యోగిత పెరుగుదలను సూచిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఉపాధి, నైపుణ్యాలను పెంచడానికి మరింత సమిష్టి చర్యలు అవసరమని సిటీ గ్రూప్ సూచించింది.
లేబర్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్యను స్వీకరించడానికి భారతదేశం వచ్చే దశాబ్దంలో సంవత్సరానికి సుమారు 12 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందని సిటీ అంచనా వేసింది. అలాగే దేశంలో సృష్టించబడుతున్న ఉద్యోగాల నాణ్యత మరొక సవాలుగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కోవిడ్కు ముందు కంటే ఇప్పుడు తక్కువ మంది వ్యక్తులు అధికారిక రంగంలో ఉపాధి పొందుతున్నారని వెల్లడైంది. ఈ ప్రతికూలతలు భారతీయ స్టాక్ మార్కెట్లపై, మార్కెట్ పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications