Indians Investing: సంపన్న భారతీయులు తమ డబ్బును విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును ఈ వార్త వినటానికి షాకింగ్ గా అనిపిస్తున్నప్పటికీ రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ రేట్లు పెరుగుదల, రూపాయి పతనం ఇందుకు కొన్ని కారణాలని నిపుణులు అంటున్నారు.

ఏఏ దేశాలకు తరలిస్తున్నారంటే..
సంపన్న భారతీయులు దుబాయ్, న్యూయార్క్, లండన్, పోర్చుగల్ వంటి ప్రదేశాల్లో ఆస్తి పెట్టుబడులు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లతో పాటు ఇతర సాధనాల్లోనూ వీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.69 బిలియన్ డాలర్లను ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు.

డబ్బు పంపటమే కాదు.. వలసవెళ్లిపోతున్నారు..
ధనిక భారతీయులు కేవలం డబ్బును పంపటమే కాదు వారే స్వయంగా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. నివేదికల ప్రకారం ఈ ఏడాది ఇలా 8 వేల మంది తరలిపోయారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా విదేశాలకు తరలిపోతున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెరగడానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక కారణం. వారు తమ వినియోగదారుల డబ్బును విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఫిబ్రవరిలో పరిస్థితి నిషేధం విధించే స్థాయికి చేరుకుంది.

డబ్బు తరలిపోతే నష్టమేంటి..?
ధనవంతులైన భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడితే దాని వల్ల మనకొచ్చే నష్టమేమేంటని అనుమానం కలగవచ్చు. పెట్టుబడుల రూపంలో ఆలోచిస్తే నష్టం లేకపోయినప్పటికీ.. ఈ ధోరణి దేశానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పన్ను వసూళ్లు తగ్గుతాయి. ఆ తరువాత దేశంలోని ప్రజలపైనే ఆ భారం పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

విదేశాల్లో పెట్టుబడులు ఎందుకు పెరిగాయి?
భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అందులో దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరగటం కూడా ఒకటి. డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకే ధనవంతులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. HDFC, ICICI వంటి దిగ్గజ బ్యాంకులు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని సౌకర్యవంతంగా చేయటం కూడా మరో కారణంగా ఉంది.

డాలర్ పుంజుకోవటంతో..
భారతీయులు విదేశాల్లో స్థిరాస్తిపై ఆసక్తి చూపుతున్నారు. న్యూయార్క్, దుబాయ్ వంటి మార్కెట్లలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. డాలర్ డామినేటెడ్ మార్కెట్లు కావడం ఇందుకు ఒక కారణం. డాలర్తో రూపాయి పడిపోవడం కారణంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి ఎక్కువ విలువను పొందుతారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications