Banking News: ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు చాలా తెలివి మీరాయి. వాటికి అసలు వ్యాపారం ద్వారా ఆదాయం కంటే కొసరు ఆదాయం భారీగా కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వసూళ్ల దందా చూస్తే కళ్లు భైర్లు కమ్మకమానదు.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 5 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి బ్యాంక్ ఖాతాదారుల నుంచి రూ.35,000 కోట్లకు పైగా ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. మినిమమ్ బ్యాలెన్స్, లిమిట్ మింటి ATM లావాదేవీలు వంటి కారణాలతో ఈ సొమ్మును వసూలు చేశాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు రూ.21,000 కోట్లు, అదనపు ATM లావాదేవీల రూ.8,000 కోట్లు, SMS సేవలకు రూ.6,000 కోట్లు వసూలయ్యాయి.

ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ ఉన్న నగరం ప్రకారం వసూలు చేసే ఛార్జీలు మారిపోతుంటాయి. మెట్రో నగరాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000 నుంచి రూ.10,000గా ఉంది. పట్టణాల్లో రూ.2,000-రూ.5,000గా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. వీటిని పాటించని విషయంలో రూ.500 వరకు ఛార్జీల రూపంలో విధించవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా AMB నాన్-కాంప్లైన్స్ ఛార్జీలతో పాటుగా ఒక్కో లావాదేవీకి సాధారణంగా రూ.100-రూ.125 వరకు నగదు లావాదేవీల రుసుమును విధిస్తుంటాయి.

ఇక ఏటీఎంలలో లావాదేవీల పరిమితిని గమనిస్తే.. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు గరిష్ఠంగా 5 లావాదేవీలను ఉచింతగా చేసుకోవచ్చు. అదే ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మూడు లావాదేవీల వరకు నెలకు ఉచితంగా పొందవచ్చు. వీటి తర్వాత ప్రతి లావాదేవీకి రూ.21 ఛార్జీ విధించబడుతుంది. అయితే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఒక నెలలో చేసే డిపాజిట్ల సంఖ్య మరియు విలువపై ఎటువంటి పరిమితి లేదు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications