rupee trading: G-20 దేశాల సమావేశాలకు ఈసారి ఇండియా అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పలు విషయాలను చక్కబెట్టుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పేద దేశాల రుణ విముక్తి కోసం చొరవ తీసుకుని, వాటి రీస్ట్రక్చరింగ్ కోసం విదేశాలను ఇటీవల ఒప్పించింది. తాజాగా మరో పెద్దపని పూర్తిచేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత G-20 సమ్మిట్ లో రూపీ వాణిజ్యాన్ని భారత్ ప్రమోట్ చేయనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. వాణిజ్య పరంగా ఇబ్బంది పడుతూ, సమస్యలు ఎదుర్కొంటున్న వివిధ దేశాలు.. రూపాయితో చెల్లింపులు జరపాలని కోరుతున్నట్లు పేర్కొంది.

త్వరలో జరగనున్న G-20 వాణిజ్య, పెట్టుబడి సమావేశాన్ని.. రూపీ వాణిజ్యాన్ని ప్రమోట్ చేసేందుకు సాధనంగా వినియోగించుకోవాలని ఇండియా చూస్తుందా అనే ప్రశ్నకు ఆ అధికారి పై విధంగా సమాధానం ఇచ్చారు. ఇది కేవలం G-20కి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. రూపాయి వాణిజ్యం ఎజెండాను ముందుకు తెచ్చే అంశం.. కేవలం G-20 సమ్మిట్ సమావేశంలో భాగం కాదని, అవకాశమున్న ప్రతిచోటా ప్రస్తావన తెస్తామన్నట్లు అధికారి పేర్కొన్నారు.

గతేడాది నుంచి నెలకొన్న కరెన్సీ అస్థిరత వల్ల వాణిజ్య పరంగా చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని ఎదుర్కొంటూ, అవసరాలను తీర్చుకోవడానికి రూపాయితో కొత్త చెల్లింపు విధానాన్ని ఇండియా ప్రపోజ్ చేసింది. ఇందుకోసం ఇప్పటి వరకు 18 దేశాలతో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. మంగళవారం నుంచి G-20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ గ్రూపులోని దేశాలతో పాటు కొన్ని ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications